Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

బింఝ్వార్ ఆదివాసీ సముదాయానికి చెందిన మంగలీ బాయి తన జీవనోపాధి కోసం అడవిపై ఆధారపడతారు, కానీ ఆమె అడవిని ఒక వనరు కంటే ఎక్కువగా చూస్తారు. అడవితో ఆమెకున్న అనుబంధం గురించిన కథనం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి

అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో సమాజాన్ని గురించి, స్త్రీల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ‘కులాల పుట్టుక’ గురించి, ‘భౌద్ధ మతం’ గురించి, బౌద్ధ మతంపై జరిగిన ‘ప్రతీఘాతుక విప్లవం’ గురించి ‘బ్రాహ్మణ మత విజయం’ గురించి రాసిన సందర్భాలను అధ్యయనం చేస్తే వాటి ఆధారంగా భారత సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కొన్యాక్ పచ్చబొట్లు: జ్ఞాపకాల పటాలు – సర్వజయ భట్టాచార్య / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

నాగాలాండ్‌కు చెందిన కొన్యాక్ ఆదివాసీ సముదాయపు సంస్కృతిలో పచ్చబొట్ట్లు ఒక విడదీయరాని భాగంగా ఉండేవి. ఆ పచ్చబొట్లను మహిళలే వేసేవారు. 1970లలో వాటిని నిషేధించిన తర్వాత, వాటిని వేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గురుజాడ సాహిత్యం .. స్త్రీ అభ్యుదయ దృక్పథం – మమత వేపాడ

కవి శేఖర బిరుదాంకితుడు ఉత్తరాంధ్రకే కాకుండా యావత్‌ ఆధునిక తెలుగు సాహిత్యానికే యుగకర్తగా నిలిచినవాడు గురజాడ. గురజాడ తన రచనలు అభ్యుదయ కాంక్షతో చేసినవే. సమాజంలోని పేరుకుపోయిన రుగ్మతలను వేలెత్తి చూపిన వాడు గురజాడ అప్పారావు. ‘అభ్యుదయం’ అనే పేరు గురజాడ తర్వాత కాలరచనల్లో ఏర్పడిరది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తిరగరాసిన అలనాటి స్త్రీ చరిత్ర ! – గౌరవ్‌

ఏటికెదురీదిన ధిక్కార స్వరాలు !! తెలుగు మహిళావాద పత్రికలు !!! సుమారు 160 ఏళ్ల క్రితం, 1862లో, సామినేని ముద్దు నరసింహం తెలుగులో ‘‘హితసూచిని’’ అనే తొలి వైజ్ఞానిక, హేతువాద గ్రంథం రచించి ప్రచురించాడు. అందులో మొదటి వాక్యం, ‘స్త్రీలకు విద్యలు సాధకములౌచున్నవి’ అదేదో ఊరికే రాసింది కాదు. అప్పుడప్పుడే స్త్రీలలో వికసిస్తున్న చైతన్యాన్ని దూరదృష్టితో … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డూయార్స్‌లోని ఒక పుస్తకాల గది – సిమ్రన్‌ ఉరావ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి తరతరాలుగా జల్‌పాయ్‌గురిలోని ఒక తేయాకు తోటలో పనిచేస్తోన్న ఉరాఁవ్‌ ఆదివాసులకు ఇప్పుడు తమకంటూ ఒక సొంత చోటు లభించింది – అదే వారి సముదాయానికే చెందిన ఒక విద్యార్థి ఏర్పాటు చేసిన గ్రంథాలయం. ‘‘దీదీ (అక్కా), మేమిక్కడ నిజంగానే మన సొంత భాషను చదువుకోవచ్చా?’’ తన చేతుల్లో ఒక కుడుఖ్‌ పుస్తకాన్ని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇక ఎవరికీ వ్యక్తిత్వం లేదు – ఫ్రెయ ఇండియా

తెలుగు: పద్మ కొండిపర్తి నా తరం ప్రతి లక్షణాన్ని ఒక వ్యాధి లక్షణంగా పరిగణించడంలో మునిగి ఉంది. మీరు బిడియస్తులు కాదు, మీరు ఆటిస్టిక్‌ (1). మీకు మతిమరుపు లేదుÑ మీకు ఎడిహెచ్‌డి (2) ఉన్నది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎప్పటికీ మానని గాయాలు ఎన్నో! – గిడ్డకింద మాణిక్యం

సమూహ యువజన సాహిత్యోత్సవంలో ప్రముఖ తమిళ దళిత స్త్రీవాద రచయిత్రి సుకీర్త రాణి కీలకోపన్యాసం. సాహిత్యం విశ్వవ్యాప్తం. మనసులోని అంతర్లీన ఆలోచనలను నిరంతరం సజీవంగా ఉంచేది సాహిత్యమే.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణలో మహిళల కథలు – వికాసం విస్తృతి వైవిధ్యం – ప్రొ. కరిమిండ్ల లావణ్య

తెలంగాణ విశ్వవిద్యాలయంలో సాహిత్య అకాడమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణ మహిళల కథలు – వికాసం, విస్తృతి, వైవిధ్యం’’ అనే అంశంపై 15 నవంబర్‌ 2025 నాడు సింపోసియం నిర్వహించారు. ఈ సదస్సుకు సాహిత్య అకాడమీ బెంగుళూరు శాఖ కార్యక్రమ నిర్వాహకులు చంద్రశేఖర టి.ఎస్‌.రాజు స్వాగతోపన్యాసం ఇస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తున్న ప్రతిష్ఠాత్మకమైన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీ విముక్తి కోసం కార్పొరేట్‌ రంగ స్లోగన్‌: లీన్‌ ఇన్‌ – ఎ. సునీత

కార్పొరేట్‌ 2013లో పేస్‌ బుక్‌ ప్రధాన ఆపరేషన్స్‌ మేనేజర్‌గా కొన్నేళ్ల నుండి పని చేసిన షెరిల్‌ సాండ్‌ బర్గ్‌ రాసిన లీన్‌ ఇన్‌: విమెన్‌, వర్క్‌ అండ్‌ విల్‌ టు సక్సీడ్‌ పుస్తకాన్ని టైం మ్యాగజిన్‌ స్త్రీవాదాన్ని రీబూట్‌ చేసే విప్లవాత్మకమయిన పుస్తకంగా వర్ణించింది. తన వ్యక్తిగత అనుభవాన్ని భూమికగా తీసుకున్న సాండ్‌ బర్గ్‌ పని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విరుదాచలంలో: మట్టిలోంచి పుట్టిన కళ – ఎమ్‌. పళని కుమార్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి తమిళనాడులోని విరుదాచలంలో ఉండే బంకమన్ను కళాకారులు పింగాణీ బొమ్మలను, మట్టి దీపాలను తయారుచేస్తారు. అయితే, అంతకుముందులా ఈ పని వాళ్ళకు స్థిరమైన ఆదాయాన్నీ, తగిన గుర్తింపునూ తీసుకురావడం లేదు. అయినప్పటికీ, ఇక్కడి కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. వాళ్ళ చేతులు మట్టి నుండి కళాత్మక వస్తువులను సృష్టిస్తూనే ఉన్నాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేశ రాజధానిలో గడ్డి రొట్టె మీద సాగే జీవనం – సంధ్య / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం – సుధామయి సత్తెనపల్లి బీహార్‌ నుంచి వలస వచ్చిన రీతా కుటుంబం యమునా నది వరద మైదానాల్లో తాత్కాలికంగా కట్టుకున్న గుడిసెలో నివసిస్తోంది. పరీక్షలకు నిలయంగా కనిపిస్తోన్న ఈ ప్రదేశంలో వారి జీవనోపాధి ఏనుగు గడ్డిని అమ్మడం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇదా నవయుగము! ఒక అభాగిని – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

సంపాదక మహాశయా! నా యీ కష్టాలను ‘గృహలక్ష్మి’ ద్వారా ప్రచురించుకుందామనే ఆశ చాలా కాలాన్నుంచి యుండేది. దాని వెంటనే పత్రికా భాష వ్రాయనేర్వని నాబోటి వాళ్లు వ్రాసిన అవకతవక భాషను ప్రచురించుతారా అనే శంక హృదయంలో తట్టి నిరుత్సాహపడుతూ వుండేదాన్ని. ఐనా ప్రత్యేకం స్త్రీల పాలిట కల్పతరువైన ‘గృహలక్ష్మి’యే నా యధార్ధ కష్టాలను ఆలింపక నిరాకరించిన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలో డిజిటల్‌ సేవలలో షెడ్యూల్డ్‌ తెగలు: అడ్డంకులు మరియు పరిష్కార మార్గం – డాక్టర్‌ సి.హెచ్‌.కృష్ణరావు

పరిచయం: డిజిటల్‌ ఇండియా అనేది పౌరులందరికీ డిజిటల్‌ సేవలను అందించడం, ఇంటర్నెట్‌ కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు సాంకేతిక రంగంలో దేశాన్ని డిజిటల్‌ సాధికారత సాధించడం అనే ప్రధాన లక్ష్యంతో భారత ప్రభుత్వం 2015 జూలైలో ప్రారంభించిన ప్రచారం. ప్రభుత్వ సేవలు పౌరులకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అందుబాటులో ఉండేలా డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలు చేపడతారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డాక్టరు కే.ఎన్‌. కేసరిగారి బంగరుపతక బహుమానమునందిన వ్యాసము ‘‘స్త్రీ అబల కాదు’’ – శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ

` సేకరణ : డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా (నెల్లూరు ప్రొగ్రెసివు యూనియను వారు ప్రతివత్సరమును ఆంధ్ర స్త్రీలకు వ్యాసరచమున పోటీ పరీక్ష నొకదానిని నిర్వహించుచున్నారు. ఈ పరీక్షకు గాను పంపబడు వ్యాసములలో నుత్తమమగు దానికి డాక్టరు కే.ఎన్‌. కేసరిగారు ఒక స్వర్ణపతకమును ఇచ్చుచుండుట వాడుక.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తన విద్యార్థుల కోసం గొప్ప కలలు కంటోన్న ఉపాధ్యాయురాలు – సంధ్య లక్రా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

Jharkhandలో, ఒక ముండా ఆదివాసీ ఉపాధ్యాయురాలు రూపొందించిన పాఠ్యాంశాల వల్ల, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ఎంతోమంది పిల్లలు తరగతి గదులకు వస్తున్నారు. చుట్టూ చీకట్లు ఆవరించే సాయంత్రం పేరే నాకు పెట్టారు. అయితే, ‘సంధ్య’ (సాయంత్రం) అనేది నల్లని నా ఒంటి రంగుకు తగిన పేరని నా కుటుంబం భావించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment