‘మరో హృదయం మరో ఉదయం’ ఒక సమీక్ష

వారణాసి నాగలక్ష్మి
అనుభవజ్ఞడైన వైద్యుడు రచయితా, విద్యుక్త ధర్మం తెలిసిన వ్యక్తి కూడా అయితే తన రంగానికి సంబంధించిన ఎన్నో విషయాలను పాఠకులెందరికో సమర్ధవంతంగా తెలియపరచడమే గాక తోటి వైద్యులకూ రోగులకూ కూడా మార్గ నిర్దేశనం చేయగలుగుతాడు. డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి నవల ‘మరో హృదయం మరో ఉదయం’ అక్షరాలా ఈ మాటని రుజువు చేస్తుంది.
రచయిత ముందు మాటలోని మొదటివాక్యంలోనే ”నిశితంగా ఆలోచించి, వైద్యం చేసే ఏ వైద్యుడైనా వ్యాధి ఎలా పరిణమిస్తుందో తెలుసుకోగలడని నా గట్టి నమ్మకం.” అంటారు. నవల అంతటా ఇదే భావన, ఇదే ఆశ కనిపిస్తుంది. ప్రతి వైద్యుడూ తన దగ్గరకు వచ్చే రోగికి తనకు తోచిన వైద్యం చేసి చేతులు దులుపుకుంటే సరికాదనీ, రోగ నిర్ధారణ సమయంలో మేధనూ, తర్కాన్నీ ఉపయోగించి మానసిక శారీరక శ్రమ కోర్చి రోగికి అత్యుత్తమమైన చికిత్సని అందించాల్సిన బాధ్యత అతనికి వుందనీ నొక్కి చెప్తుంది ఈ నవల.
అదే సమయంలో రోగులంతా నిస్సహాయులూ, విచక్షణ తెలిసిన మర్యాదస్తులూ అనుకోవడం కూడా అమాయకత్వమేనంటారు. చాలా తక్కువ శాతం ఉన్న ఉత్తమ వైద్యుల విషయానికొస్తే ఈనాటి రోగులకు అలాంటి వాళ్లు నచ్చనే నచ్చరంటారు. డిగ్రీలను బట్టి నైపుణ్యాన్ని కొలవడం, అనుభవం యొక్క అవసరాన్ని తక్కువ అంచనా వేయడం, స్వకులస్తులైతే బాగా చూస్తారని గుడ్డిగా నమ్మడం.. ఇలాంటి రోగుల్లోని మూర్ఖత్వాన్ని, మరో వైపు రోగం ముదరపెట్టి చావుబతుకుల్లో వున్న వ్యక్తిని తీసుకొచ్చినపుడు చేయగలిగిందేమీ లేదంటే ‘ఎంత డభ్బైెనా మొకాన కొడతాం’ అంటూ డబ్బు పొగరు చూపించడాన్నీ, ఆ వ్యక్తి బతక్కపోతే దౌర్జన్యానికి దిగి, కోర్టుకు లాగి అల్లరిపెట్టే అరాచకత్వాన్నీ రచయిత దగ్గరగా గమనించినట్టు అర్థమవుతుంది ఈ నవల చదివితే. తను గమనించిన అంశాలనూ, తనకెదురైన అనుభవాలనూ క్రోడీికరించి వైద్యులకూ, రోగులకూ కూడా ఉపయోగించే ఆసక్తికరమైన, కరుణార్ద్థ్రమైన నవలను పాఠకులకందించారు డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.
ఈ కథ డాక్టర్‌ శ్రీని, డాక్టరు స్వాతిల దాంపత్య జీవితంలోని అన్యోన్యతనీ, వారిద్దరి మధ్యా గల అనురాగాన్ని ఎంతో హుందాగా వర్ణిస్తూ సాగుతుంది.  అనుభవజ్ఞడూ, వృత్తిలో నిష్టాతుడూ అయిన డా. శ్రీనికి అర్థరాత్రి వేళ తీవ్రమైన గుండెనొప్పి రావడంతో నవల ఆరంభమవుతుంది. పాఠకుడికి గుండెనెప్పి అంటే ఇలా వుంటుందా అనిపించేలా వర్ణిస్తూనే, స్మారకం ఉండీ లేనట్టుగా ఉన్న రోగిని చూస్తూ చుట్టు ఉన్న నర్సులూ, వార్డుబాయ్‌లూ, డాక్టర్లూ, ఇతరులు ఎలా వ్యవహరిస్తారో అత్యంత సహజంగా కళ్ళకు కట్టిస్తారు. చదువుతుంటే ఎవరికైనా ‘ఆరోగ్యమెంత మహాభాగ్యం!’ అనిపించక మానదు. కథనం సులభంగా సరళంగా ఉండడం వల్ల పాఠకుడు సులువుగా, అప్రయత్నంగా డా. శ్రీని, డా. స్వాతిల అంతరంగాల్లోకి చొచ్చుకు పోతాడు. వారి వేదననీ, ఆత్రుతనీ, భయాన్నీ, కల్లోలాన్నీ  తను కూడా అనుభవిస్తాడు.. జీవితంలో ఎపుడో ఒకప్పుడు అంతుపట్టని రోగంతో, ఓ కొలిక్కి రాని రోగ నిర్ధారణతో అవస్థపడిన వాళ్ళంతా ఈ నవల చదువుతూ డా. శ్రీని  మానసిక స్థితిని అనుభూతిస్తారు. రచయిత శైలి ముక్కు సూటిగా సాగిపోతుంది. తనను తనే విమర్శించుకోగల నిజాయితీ, బాధితులెవరైనా వారి వైపు నిలుచుని వారి దృక్కోణం లోంచి విషయాన్ని చూడగల ‘ఓపెన్‌మైండ్‌’ పాఠకులని విస్మయ పరుస్తాయి.
డాక్టరూ, ప్రస్తుతం రోగి అయిన శ్రీనిని అనుక్షణం కనిపెట్టుకు చూసే అతని భార్య స్వాతి ఎందరో సగటు స్త్రీల ప్రతినిధిగా కనిపిస్తుంది. రచయిత  డాక్టర్‌ కూడా కావడంవల్ల ప్రభుత్వాసుపత్రుల, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలూ, అక్కడి వాతావరణం ప్రతిభావంతంగా చిత్రీకరించి వ్యవస్థలోని దిగజారిపోయిన విలువల్ని నిర్మోహమాటంగా అతిశయోక్తి ఎరుగని సహజత్వంతో ఎత్తి చూపించారు. అన్ని రంగాల్లోనూ వ్యాపించిన లోభం, లంచగొండితనం నిర్లక్ష్య వైఖరీ వైద్యరంగంలో వ్యాపిస్తే రోగుల గతి ఏమవుతుందో మనసు కంపించేలా వర్ణించారు.
పేషంటు చెప్పేదంతా నిజం కాదు. చిన్నదాన్ని పెద్దది చేసి చెపుతున్నాడు అనుకుంటాడు డాక్టరు. డాక్టరు చెప్పేదంతా నిజంకాదు. డబ్బు గుంజడానికి జబ్బుని భయంకరంగా చెపుతున్నాడు అనేది పేషంట్‌ ఆలోచన. రెండూ సరికాదు. డాక్టర్‌ పేషంట్‌ ప్రతి మాటనూ శ్రద్ధగా వినాలి. పేషంట్‌ పూర్తి నమ్మకంతో డాక్టర్‌ దగ్గరికెళ్ళాలి.”
”నీ అహంకారానికీ,  అశ్రద్ధకూ, తెలివితక్కువతనానికీ రోగిని బలిచేయకు. నీకు తెలియకపోతే నిజం  వొప్పేసుకో. మరో డాక్టర్‌ దగ్గరకు పంపు. పేరు కోసం. డబ్బుకోసం రోగుల ప్రాణాల్తో ఆటలాడకు. అంటూ రచయిత చెప్పే మాటలు ప్రతి వైద్యుడూ, ప్రతి రోగి శిరసా వహిస్తే చికిత్సా రంగంలో గొప్ప మార్పు సంభవిస్తుందంటే అతిశయోక్తి కాదు. రెండు బైపాస్‌ సర్జరీల తరువాత అనేక వ్యయ ప్రయాసలకోర్చి అనేక సార్లు మృత్యు ముఖంలోకి వెళ్ళి తిరిగివచ్చి, చివరికి తనకు ‘ఇదే చివరి రోజు..మరో ఉదయం ఉందా? లేదా?’ అనుకుంటాడు డా. శ్రీని. ఆ స్థితిలో దేశంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేయించుకున్న డా. శ్రీని కథకు ‘మరో హృదయం మరో ఉదయం’ అనే పేరు పెట్టడం అత్యంత సమంజసంగా ఉంది.
కథనం విజ్ఞానదాయకంగా ఆలోచనాత్మకంగా సాగినా కొంతమటుకు ఆటో బయాగ్రఫీలాగా అనిపించడంవల్లా, అక్కడక్కడ కనిపించిన పునరుక్తి వల్లా వేగంగా చదివించే గుణం కొరవడింది. ఇటువంటి ఉపయోగకరమైన నవల విషయంలో అది ఎన్న దగ్గ దోషం కాదని చెప్పవచ్చు. రోగిలో మానసిక స్థౖౖెర్యమూ, డాక్టర్‌ అందించే మనోబలమూ రెండూ వున్నపుడు ఇలా అవసరమైన ఎందరికో కొత్త హృదయాలు సజావుగా అమరి, కొత్త ఉదయాలు లభిస్తాయనే ఆశను కలిగిస్తుందీ నవల. రచయితకు అభినందనలు!

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.