-జి. విజయలక్ష్మి

”అవనిలో సగం

ఆకాశంలో సగం

అంతరిక్షంలో ఘనం

అవమానాల్లో నిరంతరం

అత్యాచారాలతో భయం భయం”

కఠిన చట్టాలకోసం, క్రూరమైన శిక్షలకోసం నగర రహదారులు ర్యాలీల రిబ్బన్లవుతున్నాయి. కొత్త చట్టాలు భద్రమైన సమాజాన్ని సృష్టిస్తాయని మధ్యతరగతి కలలు కంటున్నది. యాదృచ్ఛికంగా పెల్లుబికే ఆవేశాల అణచివేతకు తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో కేంద్రప్రభుత్వం దారుణ శిక్షల చట్టాల చిట్టాను వెలుపలికి తీసింది.

స్త్రీ ఆదిశక్తి, భరతమాత, జగన్మాత, మహాకాళి, మాతృ దేవత…. ఇది ఒక కోణంలో. మరో కోణంలో స్త్రీ బానిసకొక బానిస. ఈ బానిసత్వం ఒకనాటితో వచ్చింది కాదు. ఆదిమ సమాజంలో మానవుడు తండాలుగా వేటమీద ఆధారపడి జీవించే దశలో, నీది నాది అనే స్వంత ఆస్తి భావన లేని రోజుల్లో పురుషులు వేటకి వెడితే స్త్రీలుతోడు సమానశ్రమ విభజన వున్నవ్యవసాయం, పిల్లల సంరక్షణ చేస్తూ ఇంటి దగ్గరే ఉండే వారు. ఈ దశలో స్త్రీ, పురుష సంబంధాల మధ్య ఎలాంటి అంక్షలూ లేవు. ఆస్తి లేదు. కాబట్టి ఆడ, మగ మధ్య సంపూర్ణమైన సమానత్వం ఉండేది. అంతేకాదు, ఈ మాతృస్వామ్య దశలో మానవజాతి సృష్టికి కారకురాలుగా ఆమె అత్యున్నతంగా గౌరవించబడింది. ఆహార సేకరణ దశ, ఆహారోత్పత్తి దశకి చేరిన తర్వాత వ్యక్తిగత ఆస్తి ఏర్పడి క్రమంగా నీదీ, నాదీ అనుకునే దశలో స్త్రీని ఇంటిపనికి కుదించి పురుషుడు వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏకభర్తృత్వం ద్వారా వ్యక్తిగత ఆస్తి పుట్టుకకు ముందే పితృస్వామిక సమాజం ఆవిర్భవించడంతో స్త్రీపై మొదటి అణచివేత ప్రారంభమైంది. చరిత్రలో మొదటి అణచివేత ఇదే. ఆ తర్వాత మిగులు ఉత్పత్తికి, ఆస్తికి పురుషుడు హక్కుదారుడయ్యాడు. వ్యక్తిగత ఆస్తి ఏర్పాటు కారణంగా తండా పద్ధతి నశిస్తూ కుటుంబ వ్యవస్థ గట్టిపడటం ప్రారంభమైంది. మాతృస్వామిక వ్యవస్థ స్థానంలో పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. స్వంత ఆస్తి పుట్టుక స్త్రీని పురుషుడికి శాశ్వతంగా బానిసగా చేసింది.

స్త్రీని దశలవారీగా తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో నిర్భంధించి, సాంఘిక కట్టుబాట్లు ఏర్పరచి గృహ కృత్యాలకు కట్టిపడేసి స్త్రీని ఈనాటి నికృష్ట జీవితానికి గురిచేసింది. దోపిడీకి గురయ్యే పీడితులను అణచివేతను సైతం సహజమైనదిగా, దైవ సమ్మతమైనదిగా భ్రమింపచేయడంలో మతం కీలకపాత్ర వహించింది. అందులో భాగంగానే స్త్రీలపై పురుషాధిక్యత దైవసృష్టి అని ప్రచారం చేసి చిన్నప్పటినుంచే స్త్రీల మెదళ్ళలో పాతివ్రత్యాన్ని నూరిపోసి ఇలా నడవకూడదు, అలా నవ్వకూడదు అని అంక్షలు విధించారు. బాల్యం నుంచే స్త్రీని బలహీనురాలిననే ఆత్మన్యూనతా భావానికి గురిచేసి అబల అన్నారు. ఏ మతమైనా స్త్రీని అణచివేయడంలో ప్రధానపాత్రే వహించింది.

స్త్రీలపై జరిగే లైంగిక అత్యాచారాలు, తిట్లు, తన్నులు, ఆంక్షలు, సూటిపోటి మాటలు, లైంగికత్వంపై దాడి ఇవన్నీ స్త్రీలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సంఘటనలు. ఇవి కనిపించేవైతే గుట్టుచప్పుడు కాకుండా జరిగేవి కొన్ని ఉన్నాయి. ఇంటిచాకిరీ, పిల్లల పెంపకం లాంటి ఆదాయం లేని పనులు వాళ్ళకి అప్పగించి, వాళ్ళ శ్రమకి విలువ లేకుండా చేసి వాళ్ళకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేకుండా చేశారు. అసలు కుటుంబమే ఇప్పుడున్న రూపంలో హింస. దానిని నిలబెడుతున్న పితృస్వామ్య వ్యవస్థ ఈ హింస అంతటికీ మూలకారణం. రాజకీయ వ్యవస్థలకంటే బలమైనది కావడం వల్లనే ఇది మారకుండా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. స్త్రీలకు హక్కులివ్వడం, వాళ్ళకోసం చట్టాలు చెయ్యడం, కేవలం కాలానుగుణంగా చేసే మేకప్‌ మాత్రమే.

మహిళలపై హింసను నిరోధించటానికి పదహారు అంశాల కార్యాచరణను ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. చట్టాలు అమలు చేసి రూపొందించటమే కాదు జాతీయ స్థాయిలోనూ, స్థానికంగానూ పటిష్ట కార్యాచరణ వ్యూహాల్ని చెపుతోంది. మహిళా హక్కుల్ని తొక్కిపట్టే కాలం చెల్లిన చట్టాలు ఇంకా రాజ్యాంగంలో అనేకం ఉన్నాయి అవి జాతీయ మహిళా సంఘంఏనాడో ప్రస్తావించింది. ఇటీవల తెచ్చిన పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం వంటివి, కొన్నేళ్ళ క్రితం నాటి గృహహింస చట్టం వంటివి మాత్రమేస్త్రీలకు రక్షణ కవచాలు కాలేవు. అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే శిక్షలు పడుతున్నవి కేవలం 24 శాతమే. సమస్య మూలం ఎక్కడున్నది అనూహ్యం కాదు. ఇండియాలో 2010 కంటే 7.1 శాతం అధికంగా 2011లో మహిళలపై 2,28,650 నేరాలు జరిగినట్లు జాతీయ నేర నమోదు సంస్థ లెక్కతేల్చింది. అభాగ్య స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టడంలో ప్రపంచంలో ఇండియా రెండోస్థానంలో ఉంది.మహిళలపై హింసను నిరోధించటానికి పదహారు అంశాల కార్యాచరణను ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. చట్టాలు అమలు చేసి రూపొందించటమే కాదు జాతీయ స్థాయిలోనూ, స్థానికంగానూ పటిష్ట కార్యాచరణ వ్యూహాల్ని చెపుతోంది. మహిళా హక్కుల్ని తొక్కిపట్టే కాలం చెల్లిన చట్టాలు ఇంకా రాజ్యాంగంలో అనేకం ఉన్నాయి అవి జాతీయ మహిళా సంఘంఏనాడో ప్రస్తావించింది. ఇటీవల తెచ్చిన పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం వంటివి, కొన్నేళ్ళ క్రితం నాటి గృహహింస చట్టం వంటివి మాత్రమేస్త్రీలకు రక్షణ కవచాలు కాలేవు. అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే శిక్షలు పడుతున్నవి కేవలం 24 శాతమే. సమస్య మూలం ఎక్కడున్నది అనూహ్యం కాదు. ఇండియాలో 2010 కంటే 7.1 శాతం అధికంగా 2011లో మహిళలపై 2,28,650 నేరాలు జరిగినట్లు జాతీయ నేర నమోదు సంస్థ లెక్కతేల్చింది. అభాగ్య స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టడంలో ప్రపంచంలో ఇండియా రెండోస్థానంలో ఉంది.

టాటా వ్యూహాత్మకంగా నిర్వహణ బృందం తాజాగా బహుళ అధ్యయనాలను విశ్లేషించి (వెల్‌ బీయింగ్‌ ఇండెక్స్‌) మహిళారక్షణ సూచీలను వెలువరించింది. పంజాబ్‌, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానాలు అగ్రస్థానంలో ఉంటే మహిళా రక్షణ సూచీలు హర్యానా, మధ్య ప్రదేశ్‌, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌లు అట్టడుగు స్థానాల్లో వుంటున్నాయి. స్త్రీలపై సాధారణంగా జరిగే లైంగిక అత్యాచారాలకు అంతేలేదు. ఆరేళ్ళ పసివారినుండి అరవై ఏళ్ళ వృద్ధురాలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారు. ఇంటినుండి బయటికి వెళ్ళిన మహిళ క్షేమంగా ఇల్లు చేరుతుందో లేదో తెలియదు. అసలు తన ఇంట్లో తానే సేఫ్‌గా ఉండగలదా అనే ప్రశ్న.

రాణి రుద్రమ నుంచి మదర్‌ థెరిస్సా వరకు మహిళలు కేవలం వంటింటి కుందేళ్ళు మాత్రమే అనే దృక్పధాన్ని తప్పని ఏనాడో నిరూపించాం. నేటి ఆధునిక మహిళ అన్ని రంగాల్లో తన ఉన్నతిని చాటుతుంది. కొన్ని రంగాల్లో పురుషులను కూడా అధిగమించి ముందుకు దూసుకుపోతోంది. ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రభాగాన నిలచి విజయపతాక ఎగురవేస్తుంది. మహిళలను గతచరిత్ర నీడలు భయపెట్టినా వర్తమాన భవిష్యత్‌ చిత్రపటంలో తన హక్కులు నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంది. ఆకాశంలో సగం కాకుండా అనంతమంతా నేను అంటుంది.

నాణానికి రెండోవైపు చూస్తే అదే సమయంలో ఎంత విద్యావంతురాలైనా ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా ఏదో హింసకు ప్రతి నిత్యం గురవుతోంది. వయోపరిమితి, వావివరుస లేకుండా ఇంటాబయటా అనేక హింసలను ఎదుర్కొంటుంది. ప్రతిరోజు మన సమాజంలో ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఏదో ఒక హింసకు బలవుతున్నారు. అధికారిక గణాంకాలప్రకారం ప్రతి 26 నిముషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతుంది. ప్రతి 34 నిముషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిముషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, అలాగే వరకట్నం కోసం ప్రతి 99 నిముషాలకు ఒక వధువు బలి అవుతోంది.

ఇక వివాహమైన మహిళలకు కొందరి జీవితంలో పెళ్ళంటే నూరేళ్ళపంట అనేకంటే బ్రతుకంతా మంట అనవలసి వస్తుంది. కన్యాశుల్కం నాటి నుండి వరకట్నం దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఎవరైనా చైతన్యవంతురాలైన మహిళ సాటి మహిళలకు సలహా ఇవ్వబోతే భర్తే ప్రత్యక్ష దైవం అంటూ వా ఎంత హింసించినా సతీసావిత్రి సతీ అరుంధతి లాంటి పతివ్రతలనుతలుచుకొని నామొగుడు గాక నన్ను ఇంకెవరు కొడతారు తిడతారు అనే వారుఉన్నారు. మహిళ అయితే చాలు చిన్నారి అయినా, పిచ్చిదైనా వికలాంగురాలైనా అఖరికి వృద్ధురాళ్ళని కూడా అత్యాచారాలకు గురిచేస్తున్నారు. పెట్టుబడిదారులు వారి వారి వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో మహిళల్ని కేవలం వ్యాపారం అభివృద్ధి వస్తువుగా చూపిస్తున్నారు. సెక్స్‌ సింబల్‌గా జుగుప్సాకరంగా, విలన్లుగా చూపిస్తున్నారు. చదివిన దానికంటే కూడా చూసిన దృశ్యమే సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఆ విధంగా చెడు ప్రభావానికి గురైలైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, హత్యలకు, నేర ప్రవృత్తికి దారితీస్తోంది.

అత్తగార్ని కోడలు తల్లిలా ఎలా గౌరవించాలి, కోడల్ని అత్తగారు కూతురులా ఎలా అభిమానించాలి. చిన్న పిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకొని ప్రేమతత్వాన్ని నేర్పాలి, వృద్ధుల మనోభావాలుదెబ్బ తినకుండా ఏ విధమైన పద్ధతులు ప్రవేశపెట్టాలి, ఏ వయసు వారికి ఆ వయసుకు తగిన వ్యక్తిత్వం ఎలా ఉండాలి – ఇలాంటి విషయాల పట్ల కనీస అవగాహన కల్పించే సామాజిక స్పృహ, బాధ్యతలు ఈ పెట్టుబడిదారులకుగానీ,ప్రభుత్వానికి గానీ,రాజకీయ నాయకులకు గానీ లేవు. కేవలం తమ తమ లాభనష్టాలు, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వారికి ముఖ్యం.

స్త్రీలను కేవలం మార్కెట్‌ సరుకుగా, సెక్స్‌ సింబల్‌గా చూపిస్తున్న అన్ని వాణిజ్య ప్రకటనలు రద్దు చేయాలి. స్త్రీలు కేవలం లైంగిక సుఖాన్ని ఇచ్చే యంత్రాలుగా చూసే భావజాలం మారాలి. స్త్రీ, పురుషుడా అని కాకుండా మనుషుల్ని ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారిగా గౌరవించే సంస్కృతి రావాలి. అప్పుడు మాత్రమే అత్యాచారాల్ని హత్యల్ని ఆపగలుగుతాం. మహిళలపై జరుగుతున్న అన్ని దాడులకు ప్రభుత్వమే కారణం కాబట్టి మహిళలపై జరుగుతున్న హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు, యాసిడ్‌ దాడులకు పాల్పడిన నేరస్తులను ఎన్‌కౌంటర్లు చేయడం, సామాజిక అత్యాచారాలు జరిగినప్పుడు మరణ శిక్షలు విధించటం సమస్యకు పరిష్కారం కాదు. ప్రజాస్వామ్య విలువలకై పోరాడుతూ, రేపటి తరం యువతను సామ్రాజ్యవాద విష సంస్కృతి నుండి రక్షించుకోవడం మనందరి బాధ్యత. వ్యవస్థే నేరమయమైనపుడు వ్యక్తులు ఎలా నేరస్తులవుతారు. ఈ వ్యవస్థను తయారుచేస్తున్న ప్రభుత్వాలు రాజకీయపార్టీలే అసలు సిసలు నేరస్తులు. మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ వారిని అంగడి సరుకుగా మారుస్తున్న మీడియా,పెట్టుబడిదారులు, ప్రభుత్వమే మహిళలపై జరిగే హింసకు కారణం.

ఫ్యాక్టరీల్లో యజమానుల లైంగిక వేధింపులు, కూలికెళ్తే కామాంధుల కామానికి బలి కావడాలు, మైనర్‌ బాలికల్ని పనుల్లో పెట్టుకొని తండ్రి వయసున్న యజమానులు వారిపై అత్యాచారాలు చేయడం, కులంపేరుతో కింది కుల మహిళలపై అగ్రకుల పురుషులు గ్యాంగ్‌రేప్‌లు, హత్యలు చేయడం, గురువుల కామాగ్నికి బలయ్యే విద్యార్థినులు, ప్రేమను కాదన్నందుకు యాసిడ్‌ దాడులు, హత్యలు, కట్నంకోసం కిరోసిన్‌ బాత్‌లు, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, మాతంగులు, ఆడపిల్లల అమ్మకాలు, బలవంతంగా వ్యభిచారంలో దించడం, కులాంతర వివాహాలు చేసుకున్నందుకు కన్నవారే కసాయిలుగా నరకటం ఈ జాబితాకు అంతే లేదు. ఇక పోలీసుల చేతుల్లో బలైన చిత్తాయి, సిలకమ్మలు ఎంతోమంది ఉన్నారు.

పిచ్చిదైనా, పసిదైనా, ముసలిదైనా, వికలాంగురాలైన ఎవరైనా సరే, మహిళ అయితే చాలు ఈ మృగాళ్ళకు. విషపురుగుల్ని, హానిచేసే జంతువుల్ని గుర్తించవచ్చు గానీ మేక వన్నె పులుల్ని గోముఖ వ్యాఘ్రాల్ని గుర్తిచడం ఎలా? వాటి నుంచి లేడికూనల్ని రక్షించడం ఎలా? కూలి చేసే మహిళ నుండిరాజ్యాల్ని ఏలే మహిళ వరకు ఈ లైంగిక వేధింపులకు, హింసకు గురవుతున్నారు. మహిళల్ని వేధింపులకు గురిచేసే వాళ్ళ లిస్టులో రాజకీయ నాయకులు మినహాయింపు కాదు.

దేశంలో రోజురోజుకీ స్త్రీలలో చైతన్యం అభివృద్ధి చెందుతోంది. స్త్రీలు తమ చరిత్రని తాము నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో, సమాజంలో, రాజకీయాలలో కుటుంబంలో తమ స్థానంకోసం పోరాటం చేస్తున్నారు.

నిరంతరం మగపెత్తనానికి, పితృస్వామిక హింసకు గురవుతున్న భారత స్త్రీలకు తమపై అమలవుతున్న హింసకు, ఆధిపత్యాన్ని వ్యక్తిగత స్థాయిలోను, సమాజస్థాయిలోను ప్రతిఘటించడంతోపాటు కరుడుగట్టిన పురుష దృక్పథంతో రూపుదిద్దుకున్న భారత న్యాయ చట్టాల్లో స్త్రీలకు అనుకూలంగా మార్పులు తీసుకురావడానికి భారత స్త్రీలు పోరాడాలి. స్త్రీలపై జరుగుతున్న హింసాకాండను, మగపెత్తనాన్ని అత్యంత సహజమైన విషయాలుగా స్థిరీకరించిన పితృస్వామిక భావజాలాన్ని రూపుమాపేందుకు మహిళలు పిడికిలి బిగించాలి. స్త్రీ మూర్తుల్ని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దకుండా సమానత్వం, సాధికారిత రావు.

వాణిజ్య ప్రకటనల్ని, అందాల పోటీల్ని, మద్యపానాన్ని నిషేధించాలి. మానవ సృష్టికి మూలమైన సమాజంలో, సహజీవనంలో సగమైన స్త్రీ వ్యక్తిత్వాన్ని కాపాడేలా ప్రభుత్వాలు పనిచేయాలి. మగ పిల్లలకు చిన్ననాటి నుండే తమ తల్లి అక్క చెల్లిలాగే ఎదుటి స్త్రీని గౌరవించే సంస్కారాన్ని తల్లిదండ్రులునేర్పించాలి. స్త్రీల సమస్యలపై అవగాహన కల్పించాలి. అవసరం వచ్చినపుడు మాత్రమే నేర్పించడం కాకుండా ప్రాథమిక విద్య నుంచే ఆడపిల్లలకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించాలి. సంగీతం, డ్రాయింగ్‌, క్రాఫ్ట్స్‌ క్లాసుల్లాగానే స్కూళ్ళలో మార్షల్‌ ఆర్ట్స్‌ క్లాసులు నిర్వహించాలి. కార్యాలయాల్లో కంప్లెయింట్‌ బాక్సులు, కళాశాలల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి. చట్టాల్లో మార్పు కన్నా సమాజంలో మార్పు, భావజాలంలో మార్పు కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి నైతిక విద్యాబోధన జరగాలి. దుశ్శాసన సంతతిపై కఠిన శిక్షల కొరడాపడాలి. అశ్లీలతకు అడ్డుకట్ట వేయాలి. వీటన్నింటికోసం సమాజంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం పురివిప్పాలి.

దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఢిల్లీ బస్సులో నిర్భయ ఉదంతం వరకూ అత్యాచారాల చిట్టా పెరుగుతూనే ఉంది.నిర్భయ ఉదంతం జాతి గుండెలను కలచివేసినా పరమ జుగుప్సాకరంగా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నది మనం మరవకూడదు. జస్టిస్‌ జె.ఎస్‌ వర్మ సూచనల్ని కొన్నింటిని తోసిపుచ్చి అత్యవసర అదేశాన్ని జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం సామాజిక విలువలు పెంచటంలో తన వంతు ప్రయత్నం ఏం చేసిందో… ఇంకా ఏం చేస్తుందో వేచి చూడాలి.

తలవంచుకుపోతున్నా గుచ్చి గుచ్చి కాల్చేచూపులు,

ఒంటరిగా కనిపిస్తే చాలు రేటెంతనడిగే బిజినెస్‌మాన్‌లు

బస్సుల్లో రద్దీ ముసుగులో రుద్దేసే వెకిలి గాళ్ళు

ఢిల్లీ నుండి గల్లీ దాకా…

అమ్మకూ, అక్కకూ, చెల్లికీ, చెలికీ

అడుగడుగునా అవమానాలెన్నో, ఎన్నెన్నో

ఇవన్నీ ఎక్కడా నమోదు కాని వేదనలు!

మగజాతికి అనుభవం లేని అర్థంకాని నగ్నసత్యాలు

ఇంకా ఎన్నాళ్ళు. ఎన్నేళ్ళు…

ఈ బాధలూ భయాలూ గాథలూ గారడీలూ

అవమానాలు అత్యాచారాలు

మా కడుపున పుట్టి మా పాలు తాగి పెరిగి మాపైనే అత్యాచారాలా?

మగాళ్ళూ… మీరు ఎన్నటికీ మృగాళ్ళు!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.