స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం

డా.దేవరాజు మహారాజు

              రాహుల్‌ సాంకృత్యాయన్‌ రాసిన ‘ఓల్గాసే గంగా’ (కథలు), ‘విస్మృత యాత్రికుడు’ (నవల), డి.డి.

 కోశాంబి రాసిన ‘భారత చరిత్ర-పరిచయ వ్యాసాలు’, గార్డెన్‌ చైల్డ్‌ రాసిన ‘చరిత్రలో ఏం జరిగింది?’ వంటి పుస్తకాల్ని స్త్రీ దృక్కోణం లోంచి పరిశీలించి నపుడు మానవ సమాజంలో వివిధ దశల్లో స్త్రీకి ఉంటూ వచ్చిన స్థానాన్ని కొంత వరకు బేరీజు వేసుకోవచ్చు. 

తరతరాలుగా ‘ఆమె’ పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదని ఆధారాలతో నిరూపించొచ్చు.
                రాహుల్‌జీ పాలీ సంస్కృత పండి తులు.  లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో బోధన చేశారు.  స్వాతంత్య్ర యెధుడిగా జైలు జీవితం గడిపారు.  ఆయన సంపా దించుకున్న అపారమైన అనుభవం, విజ్ఞానం భారతీయ సంస్కృతిపై అనేక పుస్తకాలు రాయడానికి దోహదం చేసింది.  అలాగే మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథం గల వారందరూ డి.డి. కోశాంబిని ఆద్యునిగా భావిస్తారు.  చారిత్రక పూర్వ దశను గురించి రాసిన చరిత్రకారుల్లో గార్డెన్‌ చైల్డ్‌ హిమాలయం వంటి వాడని ఒక అభిప్రాయం ఉంది.  ఇటు సాహిత్యం, అటు చరిత్ర-సామాజిక శాస్త్రాలలో నిష్ణాతులయిన వీరి రచనల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు చాలా లోతుగా చర్చించబడ్డాయి.  కలగాపులగంగా ఉన్న ఎన్నో అంశాల్ని ఒక దృష్టికోణంతో పరిశీలించినట్లయితే – స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం మనకు సాక్షాత్కరిస్తుంది.
           మాతృస్వామ్యంలో అధికారం అంతా తల్లిదే.  ఆమె ఆజ్ఞ లేనిదే సమూహంలో ఏదీ అయ్యేది కాదు.  వేటాడడం, తోలు ఆచ్ఛాదనలు తయారు చేయడం, ప్రేమించడం అన్నీ ఆమె పర్యవేక్షణలోనే అయ్యేవి.  అప్పుడు ఒకటి మాత్రం కష్టంగా ఉండేది.  నాయకురాలి సంతానానికి తండ్రెవరో తెలిసేది కాదు.  ఇది క్రీ.పూ. 6000 నాటి పరిస్థితి.  క్రీ.పూ. 3000 నాటి క్కూడా పరిస్థితి మారలేదు.  అడిగిన వారికి ఏ స్త్రీ అయినా తలుపు తెరవకుండా ఉండేది కాదు.  నగ్నంగా నిలబడి తేనె, మద్యం అగ్నికి ఆహుతి చేసేప్పుడూ  వాయిద్యాలు వ్రెగిస్తూ అడవిలోకి వెళ్ళేప్పుడూ నాయకురాలే ముందుండేది.   అడవిలో స్వేచ్ఛగా విహరించే లేళ్ళలాగా పక్షుల్లా – స్త్రీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేది.
            క్రీ.పూ. 2500 నాటికి పరిస్థితి కొంత మారింది.  మట్టితో, రాళ్ళతో గోడలు లేచాయి.  పశువుల్ని మచ్చిక చేసుకుని, వ్యవసాయం చేయడం మొదలైంది.  సమూహాలు స్వేచ్ఛగా తిరగడం మాని, గ్రామాలుగా ఏర్పడడం మొదలయ్యింది.  తమకోసం అని కాకుండా, తమ తరువాత తరాల కోసమని ఆహారం, ఆస్థి నిలువ చేయడం మొదలయ్యింది.  దాంతో నాగరికత గొప్ప మలుపు తిరిగింది.  మట్టితో, రాళ్ళతో గోడలు రావడం, క్రమంగా స్త్రీ వాటి చాటున ఉండిపోవడం జరిగింది.  భద్రత కోసం, సహజసిద్ధమైన కొన్ని అవసరాల కోసం పురుషుడి మీద ఆధారపడాల్సి వచ్చింది.  సమూహాల మధ్య యుద్ధాలు జరగడం, మొదలయినప్పటి నుండి పురుషుడు అధికారంలోకి వచ్చాడు.  సేనకు అధిపతిగా ఉండడం మహాపితరుని కర్తవ్యం అనే భావన స్థిరపడింది.  అంతకుముందు లేని అబద్దం, మోసం, కుట్ర మొదలయినవన్నీ మనిషికి అలవడ్డాయి.  క్రీ.పూ. 2000 నాటికి పరిస్థితులు మరింతగా మారాయి.  చెట్లమీద పెరిగే ఒక రకపు ఉన్ని, గొర్రెల ఉన్ని ఉపయోగించడంతో పాటు, నూలుబట్టలు వాడుకలోకి వచ్చాయి.  పురుషుడు బలవంతుడయి స్త్రీలను రాణివాసంలో బంధించి ఉంచాడు.  అంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని హరించి, సొంత వస్తువుగా చేసుకున్న క్రమాన్ని మనం ఇక్కడ గమనించాలి.  క్రీ.పూ. 1500 నుండి 490 వరకు ఇలాంటి విషయాలెన్నో మనకి కనిపిస్తాయి.
        బలవంతుడు బలహీను   ణ్ణి అణగ దొక్కడం క్రీ.పూ. నుండే కనిపిస్తోంది.  ఒకణ్ణి దెబ్బతీసి, బానిసగా కట్టిపడేసినప్పుడే వాడి మీదా, వాడి కుటుంబ సభ్యులందరి మీదా బలవంతుడికి అధికారం లభించింది.  స్త్రీ తన పురుషుడు పెట్టే బాధల్నే కాకుండా, తనవాడికి యజమానైన బలవంతుడు పెట్టే బాధల్ని కూడా భరించాల్సి వచ్చింది.  బలవంతులు దాసజనంలో భార్యాభర్తల సంబంధాల్ని మన్నించలేదు.  స్త్రీని భర్తతో విడదీసి అమ్మారు.  పిల్లలతో విడదీసి అమ్మారు.  డబ్బున్నవాడు ఇద్దర్ని, నలుగుర్ని, పదిమందిని మాత్రమే కాదు, చివరకు వందమందిని కూడా పెళ్ళి చేసుకోగలిగాడు.  పెళ్ళి లేకుండా కూడా అనుభవించగలిగాడు.  జలక్రీడల్లో వారిని దిగంబరంగా పాల్గొనమన్నాడు.  అందమైన యువతుల్ని పాలరాతి విగ్రహాలుగా నిలుచోబెట్టుకుని, జీవితాన్ని అలంకరించుకున్నాడు.  ఒకే ఒకసారి రాజుగారు స్పర్శించిన పాపానికి వందలాది స్త్రీలు సహగమనం పేరుతో అగ్నికి ఆహుతయ్యేవారు.  క్రీ.శ. 630లో అక్షయ వటవృక్షం మీద నుంచి వితంతువులంతా యమునానదిలో దూకి ప్రాణం పోగొట్టుకోవాలని శాసనం ఉండేది.  అది ప్రయాగలో అమలు జరుగుతూ ఉండేది.  సతీసహగమనం పేరుతో వితంతువులని సజీవంగా దహనం చేయడాన్ని వారు పాపంగా భావించలేదు.  మహాపుణ్యమనే భావించారు.
           రాహుల్‌ జీ సృజనాత్మక రచనలోని ఒక పాత్ర ”హర్షుడి లాగా, మిగిలిన రాజర్షుల్లాగా లక్షమంది యువతులను అనుభవించడానికి పందెం కట్టగలిగేవాణ్ణి” – అని అంటుంది.  ఆ మాటలోని పూర్వాపరాలు ఆలోచించుకుంటే బౌద్ధమతం బాగా వ్యాప్తిలో ఉన్న సమయంలో కూడా స్త్రీకి ఎంత విలువనిచ్చారో తెలుస్తోంది.  ”బ్రహ్మచర్యం అన్నారు గాని, తరతమ భేదం లేకుండా స్త్రీలందరూ పొందుకు పనికొచ్చేవారు.  భిక్షువులు, సన్యాసులు ఉండే మఠాలన్నీ అసహజమైన వ్యభిచార గృహాలయ్యాయి.”  అందుకే కాబోలు క్రీ.పూ. 430 నుంచి యజవనులు దాసీపుత్రుల్ని వదిలేసి, పుత్రికల్ని ప్రేమతో పెంచుత వచ్చారు.  ఆ ప్రేమ వెనుక కారణాల్ని మనం చాలా సులభంగా అవగతం చేసుకోవచ్చు.  జీవితమంతా నగ్నంగా యువతులతో చేయగల వెకిలిచేష్టలన్నీ చేసిన తర్వాత, రాజులు రాజర్షులయ్యారు.  భోగులు యెగులయ్యారు.  రాణివాసంలోని యువతులందరినీ బ్రాహ్మణులకు దానం చేసి ”మోక్షం” సంపాదించారు.
         క్రీ.పూ. 1800 ప్రాంతంలో ఒకవైపు సంస్కరణవాదులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండగా, మరొకవైపు ‘దొరస్వామ్యం’ జీతగాళ్ళ పెళ్ళాల్ని బలవంతంగా అనుభవించడం జరుగుతూ వచ్చింది.  ఆనాటి పరిస్థితుల్ని వర్ణించే కథల్లో స్త్రీలను కించపరిచే జుగుప్సాకరమైన ఆజ్ఞలు ఉండేవని తెలుస్తుంది.  అలాంటి ఆజ్ఞలు ఆ కాలంలో వినిపిస్తూ ఉండేవి.  నమ్మిన బంట్లు చేసుకొస్తూనే ఉండేవారు.  అలాంటి సాంఘిక పరిస్థితుల్లో పార్లమెంట్‌కు ఓటువేసే హక్కును, విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందే అర్హతను స్త్రీకి ఊహించలేమని ఆనాటి మేధావులు కొందరు ఆవేదన వెలిబుచ్చారు.
         పందొమ్మిదో శతాబ్దంలో రామ్మోహన్‌ రాయ్‌లాంటి సంఘసంస్కర్తలు స్త్రీ జనోద్దరణకు పూనుకున్నారు.  మహిళల స్థాయి పెంచడానికి, చట్టపరంగా వారికి కొన్ని హక్కులు సాధించడానికి, వారిని విద్యావంతుల్ని చేయడానికి,  వారికోసం ప్రత్యేకమైన పత్రికలు వెలువడడానికి, వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఎంతోమంది పురుష సంఘసంస్కర్తలు కృషి చేశారు.
             కొంతకాలం తర్వాత విద్యావంతులైన మహిళలు దేశంలో తమ స్థితిగతుల్ని బేరీజు వేసుకుని తమ హక్కుల సాధనకు తామే నడుం బిగించారు.  తమ సమస్యల్ని తామే గుర్తుంచుకుని, వాటికి పరిష్కారాలు తామే కనుగొనాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకున్నారు.  ఫలితంగా 1904లో ‘భారత మహిళా పరిషత్‌’ ఏర్పాటైంది.  ఇది 1887లో ప్రారంభమైన ‘నేషనల్‌ సోషల్‌ కాన్ఫరెన్స్‌’కు ఒక శాఖగా రూపొందింది.  బాలికల విద్య గురించి ఎక్కువ శ్రద్ధ చూపి౦ది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.