ఇన్ క్రెడిబుల్ గాడెస్‌- ఉమామహేశ్వరి నూతక్కి

కప్పల్ని పాములు మింగేస్తాయి..

కబోది పిట్టల్ని బావురు పిల్లులూ..

రామ చిలకల్ని గుడ్లగూబలూ..

అలాగే పులులూ సింహాలూ చిన్న జంతువుల్నీ..

ఇది సృష్టిలో మామూలే.

డార్విన్‌ ప్రతిపాదన ప్రకారం అయితే సర్వైవల్‌ ఆఫ్‌ ద ఫిట్టెస్ట్‌ !!.

ఇదంతా బాగానే ఉంది. కానీ అవేవీ తమ స్వజాతి మీద దాడి చేయవు. అవి ఎంత బలహీనమయినవి అయి ఉండు గాక ! ఈ దురన్యాయం ఒక్క మానవ జాతి లోనే కనిపిస్తుంది. మనుష్యులే తోటి మనుష్యుల్ని హింసించి, పీడించి, రాచి రంపాన పెట్టి రాబందుల్లా పీక్కు తినే ఈ దురన్యాయం ఇలా ఎంత కాలమైనా కొనసాగవలసిందేనా ?

అని ఆవేదనగా ప్రశ్నిస్తారు డా. కేశవ రెడ్డి.

సమాధుల మధ్య జయస్థంబాలు లేచే ఈ వ్యవస్థేనా మహాత్ముడు ఆశించిన స్వరాజ్యం ? అని నివ్వెరపోతాడాయన. ఎలాంటి దాపరికం లేకుండా, మొహమాట పడకుండా దళితుల జీవన సమస్యకి కీలకమైన లోపం ఎక్కడుందో చెప్పే ప్రయత్నం డా.కేశవ రెడ్డి వ్రాసిన ”ఇన్ క్రెడిబుల్ గాడెస్‌” పుస్తకం. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కేశవ రెడ్డి తన చుట్టూరా సమాజం లోని నిమ్నోన్నతాల్ని, హింసనీ, దళితుల అంతులేని దుఃఖాన్ని మనసు తెరచి చూసిన మానవుడు. ఒక మ¬న్నత ఆశయం కోసం కలం పట్టిన రచయిత. ”ఇన్ క్రెడిబుల్ గాడెస్‌” ఆయన వ్రాసిన మొట్టమొదటి పుస్తకం.

నవలలో కథానాయకుడి పేరు రామచంద్రుడు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న దళిత యువకుడు. ఊరిపెద్ద అయిన పెద్దిరెడ్డి ఒక దొంగ సాక్ష్యం చెప్పమంటే చెప్పటానికి ఒప్పుకోడు. ఫలితంగా రామచంద్రుడి ఇల్లు లాక్కుంటాడు పెద్దిరెడ్డి. ఎదురు తిరిగిన అతనిని పెద్దిరెడ్డి దగ్గర కూలీలుగా పని చేస్తున్న తోటి దళితులే కొడతారు. ఇక ఏం చేయలేక భార్యనీ కొడుకునీ పెంపుడు పందుల్నీ తీసుకుని రాముడుండాడు రాజ్జిముండాది అన్న నమ్మకంతో ఊరు వదులుతాడు

ఎన్నో మైళ్ళు నడిచి నడిచి ఒంటిల్లు అనే కొత్త ఊరు చేరి అక్కడ పొలిమేరలో ఉన్న సత్రంలో దిగుతాడు. ఆ ఊరులో ూడా పెదరెడ్డి లాగానే ఒక మునసబు ఉంటాడు. కొబ్బరి చెట్టు ూల్చే దినూలికి చేరతాడు. పని పూర్తి అయ్యక తిరిగి వెళుతూ తన కొడుక్కి వడ దెబ్బ తగిలిందనీ ఒక్క కొబ్బరి బోండాం ఇమ్మనీ బతిమాలుకుంటాడు. మునసబు ఇవ్వక పోగా పక్కన ఉన్న మిగిలిన కూలీలు కూడా అతనిని గేలి చేస్తారు. తరువాత అక్కడ ఎదురైన పరిస్థితుల్లో మళ్ళీ సాటి కులస్థుల వల్లనే అతని పందులు మొత్తం చచ్చిపోతాయి. అంతకన్నా దారుణంగా అతని కొడుకు కూడా చచ్చిపోతాడు. తనకు మిగిలిన ఆ సగం జీవితాన్ని కూడా ఆ ఊళ్ళో పొగొట్టుకున్న రామచంద్రుడు మళ్ళీ రోడ్డున పడతాడు.

ఒక ఊరు చేరతాడు. అక్కడ కూడా అతనికి నిలువనీడ దొరకదు. ఆ ఊర్లో అర్జునరెడ్డి అనే వ్యక్తి అతనికి తన గుడిపక్కన ఉండే తన నివాసంలో చోటు కల్పిస్తాడు. రోజు పొద్దున్నే దేముడిని ఊరేగించేటపుడు అర్జునరెడ్డి ఇల్లు కూడా చుట్టి ఊరేగింపు జరుగుతుంది. తర్వాత దళిత వాడలో కలరా వ్యాపిస్తుంది. దళితుడు ఉన్న ఇంటి చుట్టూ దేముడి తిరగవలసి వచ్చింది కాబట్టి దేముడే ఆగ్రహం చూపించాడని మొత్తం దళిత వాడంతా రామచంద్రుని మీద దాడికి వస్తారు. అర్జున రెడ్డి అతన్ని కాపాడి ఇంటిలోపల దాచేస్తాడు. ఆగ్రహంతో ఆ ఇంటికి నిప్పు పెడతారు. అర్జునుడి మంటల్లో గాయపడతాడు.. అప్పటిదాకా తన కులం వల్ల తనకు ఎదురయిన అవమానాల్ని ఇబ్బందుల్నీ ఎంతో నిబ్బరంగా ఎదుర్కొన్న రామచంద్రుడు తనను కాపాడిన అర్జునరెడ్డి తనవల్ల మంటల్లో కాలిపోతున్నప్పుడు తట్టుకోలేకపోతాడు. అతనిని కాపాడడానికి కట్టుబాటు(దేవాలయ ప్రవేశం నిషిద్ధం) అతిక్రమించాల్సి వచ్చినప్పుడు నిస్సహాయంగా వణికిపోతాడు.

ఈ నవల మనలో మనలో మన మనసుల్లో రేపే సంచలనం అంతా ఇంతా కాదు. దాస్య స్వభావం అనేది దళితుల్లో నరనరానా ఇంకిపోయి ఎలా వారిని మరో జీవితం గురించి ఊహించలేనట్లుగా చేస్తుందో ఈ నవల చూపిస్తుంది. ఈ నవలలో వాస్తవానికి పెద్దిరెడ్డి, ఇంటిల్లు మునసబు అగ్ర కుల దురహంకారంతో ఉంటారు. అయితే వారి వద్ద పని చేస్తున్న దళితులు కూడా తర తరాలుగా బానిసత్వం నర నరాల వంటబట్టించుకొని స్వాతంత్య్రం అన్నది ఆలోచించడానికే ఇష్ట పడకపోవడం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

రామచంద్రుడు బానిసత్వం నుంచి విముక్తి కోసం జరిపే పోరాటం మన మనసుని కదిలిస్తుంది. కథలో తొంగి చూసే ప్రతీ పాత్రవేపూ మనూండా ఆశ గా తొంగి చూస్తాం. రామచంద్రుడికి ఎవరైనా తోడయితే బాగుండు. అని మనసు కొట్టుకు పోతుంది. సోదర మానవుల చేత అదఃపాతాళంలోకి త్రొక్కబడిన జాతులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఒకప్పుడు నీగ్రోలతో తెల్లవారు పశువులతో వ్యవహరించినట్టు వ్యహరించేవారు. ఆ తరువాత వారు హక్కుల కోసం విప్లవాలురేపి , ఎడతెగని యుద్ధాలు చేసి జయించి స్వేచ్చా వాయువులు పీలుస్తుండడం మనం చూస్తున్నాం.

అయితే శతాబ్దాలు గడుస్తున్నా దళితుల్లో అలాంటి చైతన్యం ఎందుకు రావట్లేదన్నది శేవ రెడ్డి ప్రశ్న. చివరి దాకా ఎంతో ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కొంటాడు రామచంద్రుడు. ఎంతగా ఒంటరి పోరాటం చేసినా అలసిపోడు. చివరకు తనను కాపాడినందుకు అర్జున రెడ్డి మంటల్లో కాలిపోతున్నప్పుడు ధైర్యం కోల్పోతాడు. అర్జునరెడ్డి తనను కాపాడటానికి , కాలిన శరీరం నుండి ఉపశమనం పొందడానికి గుడిలోకి వెళ్ళి ఆముదం తెమ్మన్నప్పుడు ”గర్భగుడిలోకి నేనెట్టపోదును సామి” అంటాడు నిస్సహాయంగా. అన్ని పరిస్థితుల్లోనూ ఒంటరిగా పోరాడిన రామచంద్రుడు చివరకు క్షుద్ర కుల వ్యవస్థ చేసిన కరాళ నృత్యం ముందు ఓడిపోయి తలదించుకున్నప్పుడు మనం ఉక్రోష పడిపోతాం. కోపమో , దుఃఖమో తెలియని వింత బాధ మనసుని కమ్మేస్తుంది. దాస్య స్వభావం అనేది వాళ్ళ నరనరాల్లో ఎలా ఇంకిపోయిందో, చీకట్లో మగ్గిపోతున్న వాళ్ళ జీవితాల్లోకి చిన్న వెలుగు రేఖ రావడం కూడా ఎంత కష్టమో అర్ధం చేసుకున్నప్పుడు మనం కూడా ఆ పాత్రలతో కలిసి యేడుస్తాం.

అసమ భారతీయ కుల వ్యవస్థను, హెచ్చు తగ్గుల నిచ్చెన మెట్ల లాంటి రాజకీయార్ధిక వ్యస్థను ఇన్ క్రెడిబుల్ గాడెస్‌(క్షుద్ర దేవత) గా అభివర్ణిస్తారు రచయిత డా. కేశవ రెడ్డి. మనిషిలోని బానిసత్వాన్ని, తిరుగుబాటు తత్వాన్ని అత్యంత మానవీయ కోణం నుండి దర్శించి, అంత మానవీయంగా అభివ్యక్తం చేసిన పుస్తకం ఇన్ క్రెడిబుల్ గాడెస్‌. రచయిత 1979 లో రాసిన నవల ఇది. బలవంతుడి కొమ్ము కాస్తూ తన బలం ప్రదర్శించే బలహీనుల వికృత హింసా తత్వాన్ని, వారు పొందే పాశవిక ఆనందం వెనుక వేళ్ళూనుకుపోయిన రుగ్మతని కళ్ళకు కట్టి చూపిస్తుందీ నవల.

ఈ నవల చదువుతున్నంత సేపు కేశవ రెడ్డి మన చేయి పట్టుకుని రామచంద్రుడి వెనుక మనల్నీ నడిపిస్తారు. మనం కూడా రామచంద్రుడితో పాటు పెదిరెడ్డి మనుషులు, మునసబు మనుషుల చేతుల్లో చావు దెబ్బలు తింటాం. అర్జున రెడ్డి గా మారి రామచంద్రుడిని అక్కున చేర్చుకుంటాం. అర్జున రెడ్డి మంటల్లో కాలిపోతున్నప్పుడు మనం కూడా యేడుస్తాం. ఖచ్చితంగా నవల ముగిసేసరికి

మనశ్శుద్ధి జరిగి కొత్త జన్మ ఎత్తుతాం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.