సావిత్రి (కవి సావిత్రి గారి జయంతి మే 18 సందర్భంగా) – అరణ్య కృష్ణ

బందిపోట్లు
”పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన”ని
పంతులుగారన్నప్పుడే భయమేసింది
”ఆఫీసులో నా మొగుడున్నాడు!
అవసరమొచ్చినా సెలవివ్వడ”ని
అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది
”వాడిం మగమహారాజ”ని
ఆడామొగా వాగినప్పుడే అర్ధమైపోయింది
పెళ్ళంటే పెద్ద శిక్షని
మొగుడంటే స్వేచ్చా భక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని!

ఈ కవిత రాసింది సావిత్రి. ఈ కవిత మార్చి 1984 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం అయింది. సావిత్రి ఎవరని ఈ తరం కవుల్ని అడిగితే చాలామందికి తెలియక పోవచ్చు. అటువంటి వాళ్ళకోసం సావిత్రి పరిచయం. మే 18 ఆవిడ పుట్టినరోజు. ఒక్క ‘బందిపోట్లు’ కవితతోనే ఆవిడ పేరు మార్మోగిపోయింది అప్పట్లో. భారతదేశ స్త్రీ పురుష సంబంధాలలోని ఒక కర్కశ వాస్తవాన్ని చాలా సులువుగా గుండె పగిలే పద్ధతిలో ఒక చిన్న కవితలో తేల్చిపారేసారామె. మన రక్తంలో ఇంకిపోయే విధంగా మామూలు మాటల్లో చొరబడ్డ నిరంకుశ పితృస్వామ్య భావజాలాన్ని ఆమె ఎత్తిచూపారు. 20యేళ్ళ వయసులో ఈ కవిత చదివి అశాంతికి గురైనవాళ్ళల్లో నేనూ ఒకడిని.

రాజమండ్రికి చెందిన సావిత్రి మే 18, 1949న జన్మించి అక్టోబర్‌ 4, 1991న చనిపోయారు. తన 42 ఏళ్ళ జీవితంలో అత్యధిక భాగం పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడారు. సంపన్న క్షత్రియ కుటుంబంలో పుట్టిన ఆమె తన తల్లి జీవితం కలిగించిన వేదన నుండి కవి అయ్యారు. వాళ్ళ అమ్మ అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. నా కన్నతల్లి – నా తొలి గురువే కాదు, తొలినేస్తం, తొలిభ్రాత, తొలిగ్రంధం, తొలిపాట, తొలిబొమ్మూడ మా అమ్మే నాకు. అలసిపోయేటప్పుడు పట్టే నిద్ర, గుండె భారమైనప్పుడు వచ్చే కన్నీరు, అవమానం కలిగినప్పుడు నా నిరసన తెపడానికి వచ్చే జ్వరం, దాన్ని తగ్గించుకోవాలని నేననుకుంటే ఔషధమూ, లేచి తిరగాలనుకుంటే అన్నమూ, అది సహించదనుకుంటే అనుపానమూ, ఆ తర్వాత నిద్ర రాకుండా చెప్పించుకునే కథా – అన్నీ మా అమ్మే. తన తల్లిని ఎదగనీయకుండా చేసి, ఆమె లోని సృజనాత్మకతని చంపేసిన తండ్రిలో పితృస్వామ్య విశ్వరూపాన్ని చూసారు. అందు ఆయనంటే పరమద్వేషం. 1969 లో సావిత్రికి వివాహం జరిగింది. తనతల్లికి జరిగిన అనుభవమే తనకీ ఎదురైంది. ఆమెలోని చైతన్యం పెరుగుతున్నకొద్దీ గృహస్థాయిలో ఆమె పోరాటూండా పెరిగింది. కొన్ని సంవత్సరాలపాటు తనదైన ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటంతో సావిత్రి రాటుతేలి పోయారు. దొరికిన పుస్తకమల్లా చదివేవారు. తరుచుగా పత్రికలకి, రేడియోకి ఉత్తరాలు రాసేవారు. ఆమెనెవరైనా రాజమండ్రి సావిత్రి అన్నా, ప్రభ సావిత్రి అన్నా, రేడియో సావిత్రి అన్నా పొంగిపోయేవారు. రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం సావిత్రి జీవితాన్నే మార్చేసింది. కట్టుబట్టలతో, ఇద్దరు పిల్లలతో గృహపంజరం నుండి బైటపడ్డారామె. రాజమండ్రి లోని రాజేంద్రనగర్‌ లో ఒక పూరిగుడిసె అద్దెకు తీసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ‘సమాచారం’ పత్రికలో ఉద్యోగానికి కుదిరారు. హేతువాద సంఘంలోనూ, రాజమండ్రి సాహితీ వేదిక లోనూ సభ్యులయ్యారు. సాహితీవేదిక ద్వారా ఆమెకు ఎంతోమంది సన్నిహితులు, ఆత్మీయమితృలూ దొరికారు. మల్లాప్రాగడ రామారావు, వాడ్రేవు చినవీరభద్రుడు, యర్రాప్రగడ, సోమయాజులు, గోపీచంద్‌, గంధం నాగసుబ్రహ్మణ్యం వంటివారు ఆమె మితృలు. రంగనాయ కమ్మగారితోనూ సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఆమె మార్క్సిజాన్ని బాగా అధ్యయనం చేసారు. అయితే మార్క్సిస్టులుగా చెప్పుకునే వాళ్ళలోని పురుషాధిక్య ప్రవర్తనని తీవ్రంగా వ్యతిరేకించి, వాళ్ళ దృష్టికి బలంగా తీసుళ్ళేెవాళ్ళు. తనలోని పురోగామిని రోజురొజుకీ పదునెక్కించుకున్నారు. ఒకసారి రాజమండ్రి విక్రం హాల్‌ లో రాడికల్స్‌ పెట్టిన సభని పోలీసులు భగ్నం చేసి ఆడపిల్లలతో దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆమె పోలీసులతోూడా ఘర్షణ పడ్డారు. ఆ సందర్భంలో ఆమెని ూడా అరెస్ట్‌ చేసి 15 రోజులు జైలులో

ఉంచారు. ఆ సుే వల్ల ఆమె చాలా ఇబ్బంది పడ్డారేకానీ బెంబేలెత్తిపోలేదు. ఆ తర్వాత ఆమె విశాఖపట్నం ‘డక్కన్‌ క్రానికల్‌’ లో ప్రూఫ్‌ రీడర్‌ గా ఉద్యోగంలో చేరారు. ఆ సరి ఆమె టి.బి. అల్సర్‌ తో బాధపడేవారు. తన ఆరోగ్యాన్ని దారుణంగా నిర్లక్ష్యం చేసారు. రోజురోజుకీ కృశించిపోయారు. ఉద్యోగం మానిపించేసి ఆమెని టి.బి. ఆస్పత్రిలో చేర్పించారు మితృలు, పిల్లలు. ఐదడుగుల సావిత్రి గారు వేలం 24 కిలోల బరువు తూగారు. ఈ సమయంలోనే నేనామెను మొదటిసారి చూసాను. ఆస్పత్రిలో

ఉన్నా, ఇంట్లో ఉన్నా ఎప్పుడు ఏదో ఒకటి రాస్తూ ఉండేవారు.

కళ్ళు సరిగ కనిపించేవి కావు. చెవులు వినిపించేవి కావు. హియరింగ్‌ ఎయిడ్‌ ూడా సరైన ఫలితం ఇవ్వలేదు. ఊపిరితిత్తులు పాడైపోయాయి. మందులు ూడా పనిచేసేవికావు. ఇటువంటి సందర్భంలో ఆమె ఒక చేతిని మరొక చేతితో ఎత్తిపట్టుకొని ‘మనలో మనం’ అనే పుస్తక సమీక్ష రచన చేయటం చూసాను. మృత్యువు అనివార్యం అన్న ఆ స్థితిలో ఆమెకు అలా రాయాలని ఎలా అనిపించేదో, అసలా దీక్ష ఏమిటో అంతుబట్టేదికాదు. అసలు అనారోగ్యం తనకు సంబంధించిన విషయంగా అనుకునేవారు కాదేమో అనిపించేది. కొద్దిగా ఆరోగ్యం కుదుటబడితే మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొనాలండీ అనేవారు మితృలతో. విశాఖలో ఆమెను కంటికి రెప్పగా కాపాడుకున్నది ఆమె ఇద్దరు కుమార్తెలు, ఇంకా కార్పొరేషన్‌ బాంక్‌ లో పనిచేసే సోమయాజులు. దివంగత శాంతకుమారిగారు ూడా ఆమెకు ఎంతగానో సహకరించారు. ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చుకున్నారు ూడా. ఆఖరికి అక్టోబర్‌ 4, 1991న ఆమె చనిపోయారు. విరసం కృష్ణాబాయి గారు, శాంతకుమారి గారు దగ్గరుండి అనేక అవాంతరాలను తోసిపుచ్చి, ఆమె చివరి కోర్కెననుసరించి ఆమె శరీరాన్ని ‘కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌’కి అప్పగించారు. ఆ రకంగా శ్రీశ్రీకి తీరని చివరికోరిక సావిత్రి గారికి తీరింది. ఆమె తన సాహిత్యాన్నే కాకుండా, శరీరాన్ని ూడా ఈ సమాజాని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.

సావిత్రి బందిపోట్లు తర్వాతనే స్త్రీ విముక్తివాద కవిత్వం

ఉధృతినందుకొన్నదని విమర్శకుల అంచనా. చేూరి రామారావుగారు ఈ కవితని ‘చేరాతలు’లో సమీక్ష చేసి ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆ కవితని దేశం నలుమూలల్లో అనేక విశ్వవిద్యాలయ సదస్సుల్లో చదివి వినిపించేవారు. అనేక భాషల్లోకి తర్జుమా అయింది ఆ కవిత. ఈ కవితని ఆర్లెన్‌ జైడ్‌, చేరా ఇంగ్లీష్‌ లోకి అనువాదం చేసారు. పెంగ్విన్‌ వారి ఫెమినిస్ట్‌ పొయట్రీలో ప్రచురితం ూడా అయింది.

సావిత్రిగారు మరణించిన తరువాత ఆమె మితృలం ఒక సంస్మరణ సంచికని తీసుకురావాలని సంకల్పించాం. ఆమె రచనలన్నింటినీ సేకరించే బాధ్యత నేను తీసుకున్నాను. ఆమె మొత్తం ఓ పాతిక కవితలు, కొన్న్ని వ్యాసాలు, సమీక్షలు చేసారు. అవే కాకుండా ఆమె మితృలు ూడా ఆమెతో తమ స్నేహాన్ని పంచుకున్నారు. ఆమె రచనలు, ఆమె గురించిన రచనలతో ‘సావిత్రి’ అన్న పుస్తకన్ని నా సంపాదకత్వంలో ముద్రించాము. నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చే పనుల్లో ఆ పుస్తకం కోసం పనిచేయటం. నవంబర్‌ 21, 1992న రాజమండ్రిలోనే జరిగిన ఓ సభలో చేరాగారు ఆవిష్కరించారు. అద్దేపల్లి, కృష్ణాబాయి, సతీష్‌ చందర్‌ ప్రసంగించారు. ఈ పుస్తక ప్రచురణలో అమితంగా తోడ్పడినవారు సోమయాజులు, రమేష్‌ చంద్ర (కొన్నేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకున్నారీయన), కృష్ణాబాయి గారు. ఉప్పల లక్ష్మణరావు గారి ‘బతుకుపుస్తకం’ మీద సావిత్రి చేసిన సమీక్షని ప్రస్తుత 9వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠ్యాంశంగా పొందుపరచటం జరిగింది. సావిత్రి స్మృతి సంచిక గురించి అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు

సావిత్రి పుస్తకంలో శిలాలోలిత ఈ క్రింది కవితని రాశారు. ఈ కవితతో సావిత్రిగారికి నివాళి తెలియచేస్తున్నాను.

రాలీరాలని పువ్వు      రచన: శిలాలోలిత

ఉండటానికి లేకపోవడానికి మధ్య

దూరాన్ని కొలుస్తూ సీతాకోకచిలుక ఎగిరెళ్ళిపోయింది

ఆమె ఎప్పటికీ రాయని కవిత

ఆమె ఒక విశ్వాసం, ఒక ప్రతిజ్ఞ

ఆకాశాన్ని సగానిగా కోసి స్వేచ్చగా ఎగరేసిన పతాకం

శరీరపు గుడ్డును పగలకొట్టుకుని

ఎగిరెళ్ళిపోయింది ప్రాణం పిల్ల

చావు రహస్యం విప్పుదామని

యముడితో పోరాడి భర్త ప్రాణాలు సాధించిన

పురాణ ప్రతీక కాదామె

తనకోసం ప్రపంచమంతా శోధించిన బాటసారి

ఒంటరితనాల గుహలోకి స్వేచ్చగా కాలుమోపి

అంతటా తన అడుగుల గుర్తులు వేసి వెళ్ళిపోయింది

అక్షరాలుగా అనుభవాలను మలిచి

కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించి

నిసర్గంగా తాను మాత్రం అక్షరాల్లోకి ఒదిగిపోయింది

ఇపుడు నా భుజమ్మీద సీతాకోకచిలుక వచ్చి వాలింది

రెక్కలల్లార్చుతూ ఈ అక్షరాల్లోకి తొంగితొంగి చూస్తోంది

నిశ్శబ్దంగా తనను తాను గమనిస్తున్న సావిత్రిలా వుంది

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.